AP: కూటమి సర్కార్కి బిగ్ షాక్ తగిలింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు రోడ్డెక్కారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పాకాలలోని దామలచెరువులో ఈ ఘటన చోటుచేసుకుంది. మామిడి పంటకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.రైతులతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతోందని రైతుల నిరసనకు దిగారు. తమకు పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలంటూ.. రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.