ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. 31 మంది గాయపడ్డారు. బులంద్షహర్ ఎస్పీ తేజ్వీర్ సింగ్ కథనం ప్రకారం.. ఇవాళ వేకువజామున బులంద్షహర్-అనుప్షహర్ రహదారిపై ట్రక్ డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో మరో ట్రక్కును ఢీకొన్నాడు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.