ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువులో జరిగింది. పాలచర్ల నర్సరీలో పని చేసి సాయంత్రం తిరిగి బైక్పై ఇంటికి వెళ్తున్న ఇద్దరు మహిళలను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు స్పాట్లోనే మృతి చెందారు. మరో వ్యక్తి గాయాలయ్యాయి.