అరెస్ట్ భయంతో పేర్నినాని పిచ్చి మాటలు చెప్పడాన్ని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో తన కుమారుడి విజయం కోసం నాని అనేక మోసాలు చేసినట్టు, నకిలీ పట్టాలు తయారు చేశాడని ఆరోపించారు. MRO ఆఫీసులో నకిలీ పట్టాలు ఇచ్చిన విషయాన్ని కూడా నాని ఒప్పుకోవాలని కోరారు. 2023లో బదిలీ అయిన తహశీల్దార్ 2024లో పట్టాలు ఇచ్చాడని నాని చెప్పారని, ఇది అసంభవమని మంత్రి ప్రశ్నించారు.