AP: విజయవాడ బస్టాండ్ సమీపంలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. కృష్ణలంక రహదారిపై ఆగి ఉన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో ప్రయాణీకులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే షార్ట్ సర్క్యూట్తోనే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.