ధర్మవరంలో కాల్పుల కలకలం!

77చూసినవారు
ధర్మవరంలో కాల్పుల కలకలం!
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో కాల్పులు కలకలం రేగింది. బత్తులపల్లి మండలం రామాపురంలో గుర్తు తెలియని వ్యక్తులు హల్‌చల్ చేశారు. ఆదివారం ఉదయం నలుగురు గ్రామంలోకి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. గ్రామస్థులతో వారు మాట్లాడుతుండగా.. ఓ కారు అక్కడికి వచ్చింది. దాంతో ఆ నలుగురిలో ఒకరు తుపాకీ తీసి గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. అనంతరం వారంతా అక్కడి నుంచి పారిపోయినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్