సీఎం చంద్ర‌బాబును కలసిన మాజీ మంత్రి

80చూసినవారు
సీఎం చంద్ర‌బాబును కలసిన మాజీ మంత్రి
ప్రకాశంకి చెందిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు. ఆయన అయిదేళ్ల వైసీపీ ఏలుబడిలో అధికార పార్టీలో ఉన్నారు. వైసీపీ అధికారంలో నుంచి దిగిపోయింది. దాంతో రాఘవరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మళ్లీ టీడీపీలో చేరాలని చూస్తున్నారు. శిద్ధా రాఘవరావు తమ వ్యాపార సంస్థల తరఫున యాభై లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆ చెక్ పట్టుకుని ఆయన సీఎం చంద్రబాబుని కలిశారు. దాంతో రాఘవరావుకు టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయింది అని ప్రచారం మొదలైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్