కంటతడి పెట్టిన మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

1541చూసినవారు
కంటతడి పెట్టిన మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి
టీడీపీ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కంటతడి పెట్టారు. పాడేరు టికెట్ దక్కకపోవడంతో గిడ్డి ఈశ్వరి ఆవేదనకు గురయ్యారు. ఆదివారం పాడేరులో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ‘తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలి. టీడీపీ సభ్యత్వం లేని వ్యక్తికి పాడేరు టికెట్ ఇచ్చారు. రమేశ్ నాయుడు డబ్బులిచ్చి సీటు కొనుక్కున్నాడు. పాడేరు సీటు విషయంపై పునరాలోచన చేయాలి. లేకుంటే రమేశ్ నాయుడిని ఓడించి తీరుతాం.’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్