AP: పోలీసులపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొందరు పోలీసులు దిగజారి ఉద్యోగాలు చేస్తున్నారని, టీడీపీ వాళ్లు ఏం చెప్తే పోలీసులు అదే చేస్తున్నారన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామంటే తాము అడ్డురామని, కానీ టీడీపీ వాళ్లకు ఒక న్యాయం వైసీపీ వాళ్లకు ఇంకో న్యాయమా? అంటూ ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు, నాయకుల తప్పులేకున్నా పోలీసులు వాళ్లను కొట్టి బెదిరింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.