తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో నలుగురి అరెస్ట్‌?

59చూసినవారు
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో నలుగురి అరెస్ట్‌?
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో నలుగురు నెయ్యి సరఫరా దారులను ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో ఏఆర్‌ డెయిరీ, పరాగ్‌ ఫుడ్స్‌, ప్రీమియర్‌ అగ్రి ఫుడ్స్‌, ఆల్ఫా మిల్క్‌ ఫుడ్స్‌ ప్రతినిధులు ఉన్నారు. సీబీఐ జేడీ వీరేష్ ప్రభు ఆధ్వర్యంలో సిట్ బృందం ఏఆర్‌ డెయిరీ ఎండీ రాజశేఖరన్‌‌తో పాటు విపిన్ గుప్తా, పోమిల్ జైన్, అపూర్వా చావ్‌డా‌ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. నిందితులను సోమవారం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముంది.

సంబంధిత పోస్ట్