విజయ్ హజారే ట్రోఫీ 2024-25 సీజన్లో హైదరాబాద్ నాలుగో విజయం అందుకుంది. ఆదివారం అహ్మదాబాద్లోని ఎడీఎస్ఎ రైల్వేస్ క్రికెట్ మైదానంలో అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన ఏడో రౌండ్ మ్యాచ్లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అరుణాచల్ 28.3 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ బౌలర్లు తనయ్ త్యాగరాజన్ 5, అనికేత్ రెడ్డి 14 విజృంభించారు. ఈ స్వల్ప లక్ష్యాన్ని హైదరాబాద్ 12 ఓవర్లలో ఛేదించింది.