AP: కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ బడ్జెట్ సమావేశాల తర్వాత ఈ పథకంపై ఓ క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ స్కీమ్ అమలుపై ఇప్పటికే సంబంధిత అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశమై పలు సూచనలు చేశారు. ఏపీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేసేందుకు చంద్రబాబు సర్కార్ కసరత్తులు మొదలుపెట్టినట్లు సమాచారం.