సింగిల్ స్క్రీన్ థియేటర్ కింద రిజిస్టర్ చేసుకుని, మల్టిపుల్ స్క్రీన్ నడిపిస్తున్నట్లు తమ తనిఖీలలో బయటపడిందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. ఈ నేపథ్యంలో నిబంధనలను పాటించని మాల్స్కు, మల్టీప్లెక్స్లకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు నోటీసులు జారీ అయ్యాయి. మాల్స్, థియేటర్స్, మల్టీ ప్లెక్స్లలో నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమ్రపాలి హెచ్చరించారు.