తిరుపతిలో బాలిక ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. పద్మావతిపురానికి చెందిన నవీన్ తరచూ బాలికను ఫోనులో వేధించడంతో, ఆమె తండ్రి అతనికి హెచ్చరికలు జారీ చేశాడు. అయినప్పటికీ నవీన్ వేధింపులు కొనసాగించడంతో బాలిక తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో పైకప్పు రాడ్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు నవీన్ను అదుపులోకి తీసుకున్నారు.