రాష్ట్రంలో పీఎం శ్రీ పథకం కింద మరిన్ని పాఠశాలలకు అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కోరారు. ఢిల్లీలో పర్యటించిన లోకేశ్ ధర్మేంద్ర ప్రధాన్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీఎం శ్రీ ఫేజ్-1,2లలో కలిపి ఏపీలో ప్రతిపాదించిన 2,369 పాఠశాలలకు 855 మాత్రమే మంజూరయ్యాయని మిగతా పాఠశాలలను ఫేజ్–3లో మంజూరు చేయాలని కోరారు.