‘బడ్జెట్ కాదు కుంభమేళా మృతుల సంఖ్య చెప్పండి’ అని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కోరారు. ఇవాళ లోక్సభ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కుంభమేళా నిర్వహణను ఆర్మీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘మరణాలు, గాయపడ్డ వారి సంఖ్య, మెడిసిన్, డాక్టర్లు, ఆహారం, నీరు, రవాణా వివరాలను పార్లమెంట్కు చెప్పాలి. కుంభమేళా వివాదానికి కారణమైనవాళ్లు, నిజాలు దాచిన వాళ్లను కఠినంగా శిక్షించాలి’ అని ఆయన అన్నారు.