బ్యాంకులో బంగారం మాయం (వీడియో)

76చూసినవారు
AP: కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట కెనరా బ్యాంక్‌లో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం మాయమైంది. బ్యాంకులో పని చేస్తున్న అప్రైజర్ 160 మంది ఖాతాదారుల బంగారు నగలను మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. తమ బంగారం మాయం కావడంతో బ్యాంకు వద్దకు ఖాతాదారులు చేరుకుని ఆందోళన చేస్తున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని బ్యాంక్ సిబ్బంది కస్టమర్లకు సర్దిచెప్పారు.

సంబంధిత పోస్ట్