ఆధార్ కార్డుదారులకు శుభవార్త

83చూసినవారు
ఆధార్ కార్డుదారులకు శుభవార్త
ఆధార్ కార్డు ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు పేర్కొంది. గ్రామ, వార్డు సచివాలయాలు, అంగన్వాడీలు, స్కూళ్లు, కాలేజీల్లో 4 రోజుల పాటు ఈ క్యాంపులు నిర్వహించనుంది. ఈ క్యాంపుల్లో కొత్త ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్‌డేట్, డెమోగ్రాఫిక్ అప్‌డేట్, ఈ-ఆధార్ వంటి సేవలు అందించనుంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

సంబంధిత పోస్ట్