మందుబాబులకు గుడ్ న్యూస్

76చూసినవారు
మందుబాబులకు గుడ్ న్యూస్
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కంటే తక్కువగా మద్యం ధరలు ఉండేలా ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 2019 కంటే ముందు రాష్ట్రంలో అమలైన మద్యం పాలసీనే మళ్లీ తీసుకురానున్నట్లు సమాచారం. విధివిధానాలను కేబినెట్ సబ్ కమిటీ దాదాపు ఖరారు చేసింది. అన్ని రకాల బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని కమిటీ నిర్ణయించింది. కేబినెట్ ఆమోదం తర్వాత అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి రానుంది.

సంబంధిత పోస్ట్