AP: నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దిశగా చంద్రబాబు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. తాజాగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్తో మంత్రి నారా లోకేశ్ ఒప్పందం చేసుకున్నారు. యువతలో ఏఐ నైపుణ్యాలు పెంచి వారికి ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు నారా లోకేశ్ తెలిపారు. అయితే ఈ ఎంవోయూ వల్ల దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.