తిరుమలలో ఈనెల 10 నుంచి 19వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ఉండనుంది. ఈ తరుణంలోనే ఆఫ్లైన్లో 4 లక్షల దర్శన టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. దీనికోసం తిరుపతిలో 8 ప్రాంతాల్లో, తిరుమలలో 1 ప్రాంతంలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ నెల 9న 3 రోజులకు సంబంధించిన లక్షా 20 వేల టోకెన్లు జారీ చేయనున్నారు.