కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను మూడు శాతం పెంచనున్నట్లు సమాచారం. దీనిపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందని నిపుణులు కూడా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో డీఏ పెంపుపై చర్చలు జరుగుతున్నాయని, అక్టోబర్ లేదా నవంబర్లో ప్రకటిస్తారని భావిస్తున్నారు. అయితే మొదటి డీఏ పెంపును మార్చిలో ప్రకటించిన సంగతి తెలిసిందే.