AP: రాష్ట్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక మెజిస్ట్రేట్లకు భారీ శుభవార్త చెప్పింది. వారికి గౌరవ వేతనం పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గౌరవ వేతనం రూ.45 వేలు ఉంటుందని, రవాణా సౌకర్యాల కోసం మరో రూ.5 వేలు ఇస్తామని వెల్లడించారు. 2019 ఏప్రిల్ 1 నుంచే ఇది వర్తిస్తుందని మంత్రి ఫరూక్ తెలిపారు.