ఏపీలోని మంత్రుల పేషీలపై ప్రభుత్వం నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం కేబినెట్లో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. కొంతమంది మంత్రుల ఓఎస్డీ, పీఎస్, పీఏలపై అవినీతి ఆరోపణలు వస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరికలు, రిపోర్టులు ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న సీఎం, మంత్రి కొల్లు ఓఎస్డీపై చర్యలు చేపట్టనున్నారు.