మెట్రో రైలు ప్రాజెక్టుల భూసేకరణకు సిద్ధమైన ప్రభుత్వం

54చూసినవారు
మెట్రో రైలు ప్రాజెక్టుల భూసేకరణకు సిద్ధమైన ప్రభుత్వం
AP: విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడలో 101 ఎకరాలు, విశాఖలో అవసరమైన 98 ఎకరాలు కలిపి మొత్తం 199 ఎకరాల భూ సేకరణకు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. రెండు చోట్లా కలిపి తొలి దశ పనులకు రూ.11,009 కోట్లు అవసరమని అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డీపీఆర్‌లను కేంద్రానికి ఆమోదం కోసం పంపింది. 100 శాతం నిధులు ఇవ్వాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు.

సంబంధిత పోస్ట్