AP: బాపట్ల జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్రానైట్ పలకలతో వెళ్తున్న లారీ బోల్తా పడి.. ముగ్గురు చనిపోయారు. గుంటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతి చెందిన వారు పాలపర్తి శ్రీను (25), ప్రభుదాస్ (37), తమ్మూలూరి సురేంద్ర (26)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.