రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి తీసుకెళ్లాలి: పవన్

61చూసినవారు
రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి తీసుకెళ్లాలి: పవన్
AP: అటవీశాఖ అధికారులతో మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి తీసుకెళ్ళేందుకు చేపడుతున్న చర్యలు, వన్యప్రాణులు మానవులు మధ్య ఘర్షణ వాతావరణం అరికట్టేందుకు తీసుకోవలసిన చర్యల గురించి చర్చించారు. అడవి సంరక్షణలో స్థానిక ప్రజల పాత్రను పెంచడం, ఎకో టూరిజంని అభివృద్ధి చేయడంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్