AP: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. కాసేపట్లో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ చేయనుంది. మే 3 నుంచి 9వ వరకు గ్రూప్-1మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 4వేల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఏపీపీఎస్సీ జాప్యం లేకుండా మూల్యాంకనం పూర్తి చేసింది. ఏపీపీఎస్సీ 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను మౌఖిక పరీక్షలకు ఎంపిక చేయనుంది.