భారత్-పాక్ ఉద్రిక్తత కారణంగా వాయిదాపడిన ఐపీఎల్ శనివారం పున: ప్రారంభమైంది. ఈ నెల 22న తాము ఆడే మ్యాచ్లో లావెండర్ రంగు జెర్సీ ధరిస్తున్నట్లు GT తెలిపింది. క్యాన్సర్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచారంలో భాగంగా గుజరాత్ ఈ నిర్ణయం తీసుకుంది. 16 పాయింట్లతో టేబుల్లో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ ఆదివారం ఢిల్లీ, 22న లక్నోతో తలపడనుంది.