రాబోయే కృష్ణ, గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని నిజాంపట్నం జడ్పిటిసి నర్రా సుబ్బయ్య కోరారు. ఆదివారం నిజాంపట్నంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చేసిన మంచి పనులను, అభివృద్ధిని గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులకు వివరించి ఆలపాటికి ఓటు వేసేలా ప్రచారం చేయాలన్నారు.