మాజీ మంత్రి విడదల రజినిపై జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు మాధవరావు తీవ్ర విమర్శలు చేశారు. 2019లో మాయమాటలతో అధికారంలోకి వచ్చిన ఆమె, శ్రీకాంత్ రెడ్డి వంటి దుర్మార్గులు ఆమె వెంట ఉన్నారని ఆరోపించారు. శుక్రవారం ఆయన చిలకలూరిపేట ఎమ్మెల్యే కార్యాలయంలో మాట్లాడారు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించి దాడికి యత్నించిన ఘనత రజనిదేనని అన్నారు. ఆమె మాటలను ప్రజలు విశ్వసించరని అయన అన్నారు.