తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి విడదల రజిని గురువారం మాజీ సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. పలు అంశాలపై ఆయనతో చర్చించారు. చిలకలూరిపేటలో పార్టీ పరిస్థితిపై జగన్ ఆరా తీశారు. నాయకులను, కార్యకర్తలను, ప్రతి ఒక్కరిని కలుపుకొని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన కోరారు.