జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తుందని ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం చిలకలూరిపేట రజక కమ్యూనిటీ హాల్లో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. గాదె వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నీతి, నిజాయితీతో పార్టీని నడిపిస్తూ కార్యకర్తలకు అండగా ఉన్నారని కొనియాడారు. అనంతరం క్రియాశీలక సభ్యత్వ కిట్లను పంపిణీ చేశారు.