బాపట్ల జిల్లా చీరాల మండలం, హిందూ పరిషత్ చీరాల శాఖ ఆధ్వర్యంలో సుమారు 1500 మంది హైందవ శంఖారావం కార్యక్రమానికి ఆదివారం విజయవాడ బయలుదేరారు. ఈ కార్యక్రమ ఉద్దేశం దేవాదాయ శాఖను ప్రభుత్వ ఆధీనంలో నుంచి తొలగించి దేవాలయాలకు ప్రతిపత్తి కల్పించడమే. ఈ కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ నాయకులు గుగ్గిళం తులసిరావు, కొర్నిపాటి మహేష్, మువ్వల వెంకటరమణారావు తదితరులు నిర్వహించారు.