చీరాల పట్టణం పేరాల సెంటర్ లో నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం పేదలకు అల్పాహార పంపిణీ కార్యక్రమం జరిగింది. ముందుగా ప్రతినిధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సమితి అధ్యక్షుడు చుండూరి కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రతినెల అల్పాహార పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
పవని భానుచంద్రమూర్తి, రమేష్, రామారావు, నాగేశ్వరరావు, వెంకటేశ్వర రావు, మణి తదితరులు పాల్గొన్నారు.