చీరాల ఎక్సైజ్ సీఐ పేరం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయన సిబ్బంది శనివారం కారంచేడు మండలంలో విస్తృతంగా దాడులు జరిపిన క్రమంలో కుంకలమర్రు గ్రామంలో ప్రభుత్వ అనుమతికి మించి అధికంగా మద్యం సీసాలు కలిగి ఉన్న ఓ మహిళ పట్టుబడింది. ఆమె వద్ద నుండి పది మద్యం సీసాలు స్వాధీన పరుచుకున్నారు. ముద్దాయి బెల్లంకొండ యామినిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సిఐ తెలిపారు. ఎస్. ఐ శ్రీహరి కూడా పాల్గొన్నారు.