పేదల సొంతింటి కలను సాకారం చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 19న రాష్ట్రవ్యాప్తంగా అన్ని తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా చేపడుతున్నట్లు సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. కొత్తపేటలో శనివారం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో 5 సెంట్లు, పట్టణాల్లో 3సెంట్ల భూమి కల్పించడంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థికసహాయం అందించాలన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైందని విమర్శించారు.