గుంటూరు పట్టణంలోని ఏసీ కళాశాలలో తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఈవీఎంల కేటాయింపు ప్రక్రియ శనివారం నిర్వహించారు. గుంటూరు కమిషనర్ కీర్తి చేకూరి తో కలిసి గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఈవీఎంల కేటాయింపును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎంల కేటాయింపు ప్రక్రియ ఎంతో కీలకమని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.