పాముకాటుతో విద్యార్థి మృతి బాధాకరం: నారా లోకేశ్

72చూసినవారు
పాముకాటుతో విద్యార్థి మృతి బాధాకరం: నారా లోకేశ్
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ బుద్ధిస్ట్ స్టడీస్ చదువుతున్న మయన్మార్ విద్యార్థి కొండన్న పాముకాటుకు గురై మృతి చెందడం పై మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా యూనివర్సిటీ అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని, కొండన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్