నరసరావుపేట 1 టౌన్ సీఐగా విజయ్ చరణ్ బాధ్యతలు స్వీకరించారు. అయన గతంలో వినుకొండ నియోజకవర్గంలోని ఐనవోలు, బొల్లాపల్లి, గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్లలో ఎస్ఐగా విధులు నిర్వహించారు. సీఐగా పదోన్నతి పొంది పల్నాడు జిల్లా సోషల్ మీడియా, సైబర్ క్రైమ్ సెల్లో పనిచేశారు. శుక్రవారం సాధారణ బదిలీల్లో వన్ టౌను వచ్చారు.