తమ భూములు ఆక్రమించారంటూ బెల్లంకొండ మండలం మన్నెసుల్తాన్ పాలెం ఎస్టీ కాలనీ వాసులు శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ48 ప్రభుత్వం తమకు 25 కుటుంబాలకు కేటాయించిన 75 ఎకరాల భూములు గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించారని అన్నారు. తమ భూములు తిరిగి తమకు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు.