ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేయడంలో భారత సైనికుల దైర్య సాహసాలను స్మరించుకుంటూ తిరంగా యాత్ర నిర్వహించారు. విరోచిత పోరాటం చేసిన భారత సైనికులకు మద్దతుగా మేమున్నామంటూ నినాదంతో శుక్రవారం నరసరావుపేట పట్టణంలో ఎస్ ఎస్ ఎన్ కళాశాల వద్ద నుండి మల్లమ్మ సెంటర్ వరకు చేపట్టిన తిరంగా ర్యాలీకీ నరసరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు డచదలవాడ అరవింద బాబు పాల్గొని ప్రారంభించారు.