కూటమి ప్రభుత్వం గెలిచిందంటే దానికి కారణం ప్రజలేనని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా నరసరావుపేటలో టీడీపీ జెండా ఎగరలేదన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని 2047 వరకు నరసరావుపేటలో టీడీపీ జెండానే ఎగురుతుందని దానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.