పెదకూరపాడు మండలం 75 త్యాళ్ళూరు హైస్కూల్ ప్లస్ లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎండిఎంను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఇఓ టి.సత్యనారాయణ, ఎస్ఎంసి చైర్మన్ పున్నారావు, హెచ్.ఎం ఎ.శ్రీనివాస రెడ్డి, గ్రామపెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.