పెదకూరపాడు మండలం 75త్యాళ్ళూరు హైస్కూల్లో శనివారం లూయీ బ్రెయిలీ జయంతిని ఘనంగా నిర్వహించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారి చేసి వారికి జ్ఞాన కవాటాలను ప్రసాదించిన మహనీయుడు లూయీ బ్రెయిలీ అని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ చీహెచ్. సుబ్బరావు అన్నారు. దీనిలో హెచ్ఎం ఎ. శ్రీనివాస రెడ్డి, పీసి చైర్మన్ జీ. పున్నారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.