
గుడ్ న్యూస్.. ఐపీఎల్ పునఃప్రారంభానికి తొలగిన అడ్డంకి!
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. భారత్, పాకిస్థాన్లు కాల్పుల విరమణకు అంగీకరించడంతో ఉద్రిక్తతలు తగ్గిపోయాయి. దీని ఫలితంగా ఐపీఎల్ పునఃప్రారంభానికి ఉన్న ప్రధాన అడ్డంకి తొలగింది. ఈ నేపథ్యంలో అర్ధాంతరంగా నిలిచిన ఐపీఎల్ మ్యాచ్లు మరో వారం రోజుల్లో మళ్లీ ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం. సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా బీసీసీఐ వారం రోజుల పాటు వాయిదా వేసిన ఐపీఎల్ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.