గుంటూరు జిల్లా పొన్నూరు మండలం జడవల్లి గ్రామంలో గురువారం రెవెన్యూ సదస్సు జరిగింది. రెవెన్యూ సదస్సులో మండల తహసిల్దార్ మహమ్మద్ జియావుల్ హక్కు పాల్గొన్నారు. గ్రామంలో వివిధ రెవెన్యూ సమస్యల 18 అర్జీలు అందించినట్లు ఆయన తెలిపారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు రెవిన్యూ సదస్సులు ఉపయుక్తంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సమస్యలు సత్వర పరిష్కరిస్తామని అన్నారు.