సత్తెనపల్లి రూరల్ మండలం గడిపూడి గ్రామంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. రెండు రోజులుగా గ్రామంలో సంచరిస్తూ వేరే వ్యక్తి మీది ఏ ఊరు అని అడగగా మాచవరం అని చెప్పాడు. ఆ తర్వాత చనిపోవడంతో అతని మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.!