ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. గుంటూరు జేకేసీ కాలేజీ రోడ్డులో ఉన్న తాడికొండ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో శనివారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలు అక్కడికక్కడే అధికారులకు ఫోన్లు చేసి పరిష్కరించారు.