ఈపూరు ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మద్యం దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం ఆయన స్టేషన్ పరిధిలోని అన్ని మద్యం షాపులను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన అనంతరం, ప్రభుత్వ నిబంధనల మేరకు అమ్మకాలు జరపాలని దుకాణ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు.